దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన పార్టీ తరఫున మద్దతు ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు.. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ టార్గె్‌ట్‌గా కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీతో పాటూ నేతలు, కార్యకర్తలు.. వక్ఫ్ ఆస్తుల విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటో 2008-2009లోనే చెప్పారంటూ ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే వక్ఫ్ బిల్లు విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటో తెలుస్తుందంటున్నారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ వక్ఫ్ ఆస్తుల విషయాన్ని ప్రస్తావించారు.



ఆ వీడియోలో.. 'నేను హైదరాబాద్ పాతబస్తీలో పర్యటించాను.. ఏడాది పాటూ ఎన్నో ముస్లిం కుటుంబాలను, ముస్లిం మత పెద్దలు, ముస్లిం మీడియా అధినేతల్ని, ముస్లిం రాజకీయ నేతల్ని కలిశాను. అందరిలో కామన్‌గా చెప్పే బాధ ఒకటే.. వక్ఫ్ ఆస్తులనేవి.. చాలా డబ్బున్నవాళ్లు వెళ్లిపోతూ తమ ఆస్తుల్ని తదనంతరం పేద ముస్లింలకు చెందాలని చెప్పి అల్లా పేరు మీద రాసిచ్చారు. వక్ఫ్ ఆస్తుల్ని ఎవరైనా ముట్టుకుంటే.. స్వయానా అది భగవంతుడి ఆస్తి.. ఆ భగవంతుడి ఆస్తి చెందాల్సింది సామాన్యులు, పేద ముస్లిం ప్రజలకు.. అది అన్యాక్రాంతమై దోపిడీ చేస్తుంటే.. దానికి పడిన బాధ.. నేను కలిసి ప్రతి ఒక్క ముస్లిం కుటుంబం బాధను, పేదరికాన్ని చూశాను. కొంతమంది వారిని ఎలా దోపిడీ చేశారో చూశాను' అన్నారు పవన్ కళ్యాణ్. కేంద్రం కూడా ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. వక్ఫ్ బిల్లు పేద ముస్లింల సంక్షేమం, మహిళలు, పిల్లల కోసమని.. వక్ఫ్ ఆస్తుల పారదర్శకత, జవాబుదారీ తనం కోసమే తాము పనిచేస్తున్నామని చెబుతోంది.. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చెప్పగా.. ఆ వీడియోను కూడా పవన్ కళ్యాణ్ వీడియోతో కలిపి వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగమైన యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు వక్ఫ్ బిల్లుకు మద్దతుపై జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. 'లోక్‌ సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్స్‌ సవరణ బిల్లుకు జనసేన పార్టీ మద్దతు తెలియచేస్తోంది. ఈ చట్ట సవరణ ముస్లిం సమాజానికి మేలు చేస్తుందని జనసేన విశ్వసిస్తోంది. ఈ మేరకు లోక్‌ సభలోని జనసేన ఎంపీలకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు దిశానిర్దేశం చేశారు. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటింగ్‌ లో పాల్గొనాలని జనసేన పార్లమెంట్‌ సభ్యులకు తెలిపారు. 'వక్స్‌ చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లును 31 మంది సభ్యులతో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి సమీక్షించారు. సంబంధిత వర్గాలతో, విద్యావంతులతో, పాలనా రంగ నిపుణులతో చర్చించి ఈ బిల్లును రూపొందించారు. బ్రిటిష్‌ కాలంనాటి వక్‌ చట్టాన్ని నేటి కాలానికి తగిన విధంగా క్రమబద్ధీకరించడం ద్వారానే విస్తృత ఫలితాలు దక్కుతాయి. ఈ కమంలో వక్స్‌ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలి" అని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారని జనసేన పార్టీ ప్రకటనలో తెలిపింది.


Axact

Axact

చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి **************************** చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి

Post A Comment:

0 comments: